
రూ.3 లక్షలు నష్టపోయా
వరదనీరు ఇంట్లోకి చేరి వస్తువులన్నీ తడిచిపోయాయి. సామానంతా పాడైపోయింది. రూ.3లక్షలు నష్టపోయా. ఇంట్లోకి నీళ్లు రావడంతో రోజంతా వేరే ప్రాంతంలో గడపాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి ఈసారి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– ఎండీ రజాక్, మల్కాపూర్
నీళ్లలో కొట్టుకుపోయింది
నీళ్లన్నీ ఇళ్లలోకి వచ్చాయి. 10 క్వింటాళ్ల బియ్యం తడిచిపోయాయి. వాషింగ్ మిషన్ నీళ్లలో కొట్టుకుపోయింది. మూడు మోటార్ సైకిళ్లు పాడైపోయాయి. రూ.4.50లక్షల నష్టం వచ్చింది. పోలీసులు వరద నుంచి కాపాడారు. మళ్లీ అప్పటి పరిస్థితి రాకుండా చూడాలి.
– ఎరుకల రాజయ్య,
సింగరేణి రిటైర్డ్ కార్మికుడు, సప్తగిరికాలనీ
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాం
మెయిన్ డ్రైనేజీలను అభివృద్ధి చేస్తున్నాం. మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు రూ.60కోట్లు కేటాయించాం. పార్వతీ బ్యారేజీ గేట్లు ఎత్తివేస్తే బ్యాక్ వాటర్ సమస్య ఉండదు. ఎగువ నుంచి అనూహ్యంగా వరదలు వస్తే తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నాం.
– మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్,
ఎమ్మెల్యే, రామగుండం

రూ.3 లక్షలు నష్టపోయా

రూ.3 లక్షలు నష్టపోయా