నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాల్సిందే | - | Sakshi
Sakshi News home page

నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాల్సిందే

Jun 7 2025 12:05 AM | Updated on Jun 7 2025 12:05 AM

నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాల్సిందే

నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాల్సిందే

● రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షికి స్పష్టం చేసిన కరీంనగర్‌ పార్లమెంటరీ నేతలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్ని కల్లో పార్టీకి మంచి ఫలితాలు రావాలంటే.. తప్పకుండా నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేయాల్సిందేన ని కరీంనగర్‌ పార్లమెంటరీ నాయకులు అధిష్టానానికి స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో కరీంనగర్‌ పార్లమెంటరీ సమీక్ష నిర్వహించా రు. ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చా ర్జి మీనాక్షి నటరాజన్‌ జిల్లా నేతలతో చర్చించా రు. ఈ సందర్భంగా నేతలందరి నోట దాదాపుగా ఒకే డిమాండ్‌ వినిపించింది. అధికారంలోకి వ చ్చి ఏడాది గడుస్తున్నా.. డీసీసీ, కార్పొరేషన్‌ చైర్మ న్లు సహా నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేయకపోవడంపై కిందిస్థాయి నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని వెల్లడించారు. వెంటనే పోస్టులు భ ర్తీ చేయకపోతే.. పార్టీకి క్షేత్రస్థాయిలో జరిగే నష్టాలను వివరించారు. పదవులు భర్తీ చేయలేకపో తే.. గ్రామాల్లో సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఉండదని కుండబద్ధలు కొట్టారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న మీనాక్షి.. త్వరలోనే పదవుల భ ర్తీ ఉంటుందని, కష్టపడి పనిచేసిన వారందరికీ సముచితస్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు అధిష్టానం ఇచ్చే ప్రొఫార్మా ప్రకారం.. పేర్లు పంపాలని సూచించారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ల విలీనం తథ్యం

పథకాల అమలులో విపక్షాలు చేస్తున్న దుష్ప్రచా రాన్ని తిప్పికొట్టాలని, సన్నబియ్యం, ఇందిరమ్మ పథకాల అమలు తీరును మరింతగా జనాల్లోకి తీ సుకెళ్లాలని సూచించారు. బీజేపీ ధర్మం పేరుతో చేస్తున్న చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలోనూ బీజేపీ వ్యవహరించిన తీరు, దాని వైఫల్యాలను ఎండగట్టాల ని ఆదేశించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఏనాటికై నా బీజేపీలో విలీనం కావాల్సిందేనని, ఆ పార్టీల మైత్రిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఇక తాము ఎన్ని కల ముందు పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని, తమకు న్యాయం జరగాలని మాజీ ఎమ్మె ల్యే ప్రవీణ్‌రెడ్డి, సిరిసిల్ల కాంగ్రెస్‌ నేత కేకే మహేందర్‌రెడ్డి, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇ న్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు తదితరులు గు ర్తుచేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, ప్రణవ్‌బాబు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, సీని యర్‌ నేత కటకం మృత్యుంజయం, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ సత్తు మల్లేశ్‌, నరేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement