
బాలికలు గొప్పస్థాయికి చేరుకోవాలి
జ్యోతినగర్(రామగుండం): బాలికలు గొప్పస్థాయికి చేరుకోవడానికి ఎన్టీపీసీ అందించే శిక్షణ దో హదం చేస్తోందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నా రు. ఎన్టీపీసీ కాకతీయ ఆడిటోరియంలో సీఎస్సా ర్ ఆధ్వర్యంలో బుధవారం బాలికా సాధికారత మిషన్–2025 రెసిడెన్షియల్ శిక్షణ ముగింపు వే డుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ హాజరై మాట్లాడారు. భవిష్యత్లో బాలికలు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత మాట్లాడుతూ, విద్యుత్ రంగంలో అగ్రగామిగా నిలిచిన ఎన్టీపీసీ.. సమర్థవంతమైన, సరసమైన విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కట్టుబడి ఉందన్నారు. 2032 నాటికి 130 గిగాబైట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని ల క్ష్యంగా నిర్దేశించిందని తెలిపారు. చిన్నారుల ప్ర దర్శనలు ఆకట్టుకున్నాయి. ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత, దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా, ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్, ప్రవీణ్ చౌదరి, సీఎస్సార్ ప్రతినిధులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఆస్పత్రి భవన నిర్మాణాల్లో వేగం పెంచాలి
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పెద్దపల్లి, మంథని ప్రభుత్వ ఆస్పత్రుల భవన నిర్మాణాలు, మంథని ప్రభుత్వ ఆస్పత్రి పనితీరుపై జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్, అధికారులతో ఆ యన కలెక్టరేలో సమీక్షించారు. రూ.57 కోట్లతో చేపట్టిన వంద పడకల భవనంలోని ఒక బ్లాక్ను వానాకాలంలోగా పూర్తిచేయాలని సూచించారు. మంథనిలో రూ.26కోట్లతో చేపట్టిన 50 పడకల ఆస్పత్రి భవనం పనులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. మంథనిలో వైద్యసేవలు మెరుగుపర్చాలని, అవుట్ పేషెంట్ల సంఖ్య పెంచాలని పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాతా శిశు ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు.
రెసిడెన్షియల్ స్కూళ్లు సిద్ధం చేయాలి
జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూ ళ్లను ఈనెల 10వ తేదీవరకు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో మాధవి, బీసీ వెల్ఫేర్ అధికారి రంగారెడ్డి, ఎస్సీ సంక్షేమ అధి కారి వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష

బాలికలు గొప్పస్థాయికి చేరుకోవాలి