పొగాకు ఉత్పత్తులు హానికరం | - | Sakshi
Sakshi News home page

పొగాకు ఉత్పత్తులు హానికరం

May 31 2025 12:54 AM | Updated on May 31 2025 1:24 AM

పెద్దపల్లిరూరల్‌: ప్రతి ఒక్కరూ పోషక విలువలున్న ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, హానికారకమైన పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని జిల్లా అడిషనల్‌ జడ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌జడ్జి మంజులతో కలిసి పాల్గొన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకును, వాటితో తయారయ్యే వస్తువులకు దూరంగా ఉండాలన్నారు. పొగాకు వల్ల కలిగే దుష్ఫలితాలపై వివరిస్తూ ప్రజల్లో చైతన్యం పెంచాలన్నారు.

నిరంతరం పెట్రోలింగ్‌ చేయాలి

ఓదెల(పెద్దపల్లి): పోలీసులు నిరంతరం పెట్రోలింగ్‌ చేయాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌, ఏసీపీ కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌ను డీసీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్‌ కేసులపై ఆరా తీశారు. ఠాణాకు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి సమస్యలు పరిష్కరించాలన్నారు. స్టేషన్‌ పరిధిలో సమస్యాత్మక గ్రామాలపై నిత్యం నిఘా పెట్టాలని సూచించారు. మత్తు పదార్థాలు రవాణా చేసే వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలన్నారు. ఎస్సై రమేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

సమ్మర్‌ క్యాంపు తనిఖీ

పెద్దపల్లిరూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సమ్మర్‌క్యాంపులను నిర్వహిస్తున్న తీరును పర్యవేక్షించేందుకు విద్యాశాఖ ప్రత్యేకాధికారి దుర్గాప్రసాద్‌ శుక్రవారం జిల్లా కేంద్రంలోని అమర్‌నగర్‌ ప్రైమరీ స్కూల్‌ను డీఈవో మాధవితో కలిసి సందర్శించారు. వేసవిలో విద్యార్థులు ఆటపాటలతో తమ మేధస్సును పెంచుకునేందుకు వీలుగా ప్రభుత్వం సమ్మర్‌క్యాంపులను నిర్వహిస్తోందన్నారు. ఉద యం 8.30 నుంచి 11గంటల వరకు అందుబా టులో ఉంటూ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. సీఆర్‌పీ బాలసాని వెంకటేశం తదితరులున్నారు.

అభ్యసన సామర్థ్యాలు వెలికితీయాలి

సుల్తానాబాద్‌రూరల్‌: శిక్షణ కాలంలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేసి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను వెలికి తీయాలని జిల్లా విద్యాధికారి మాధవి అన్నా రు. సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఉపాధ్యాయుల కెపాసిటి బిల్డింగ్‌పై శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా అబ్జర్వర్‌ దుర్గాప్రసాద్‌, డీఈవో శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. కోర్స్‌ డైరెక్టర్‌ కవిత, రిసోర్స్‌ పర్సన్స్‌ నరేశ్‌, కుమార్‌, సాధన, ప్రత్యక్ష, సీఆర్సీలు కిరణ్‌కుమార్‌, మంజుల తదితరులున్నారు.

యాజమాన్య పద్ధతులు పాటించాలి

కమాన్‌పూర్‌(మంథని): పంటల సాగులో రైతులు తప్పనిసరిగా యాజమాన్య పద్ధతులు పాటించాలని శాస్త్రవేత్తలు అన్నారు. మండలంలోని గుండారం, నాగారం, సిద్దిపల్లె గ్రామాల్లో ఖరీఫ్‌ పంటల సాగు విధానాలపై శుక్రవారం రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వికసిత్‌ కృషి సంకల్ప అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. ఖరీఫ్‌ సాగుకు రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. అధిక దిగుబడులు ఇచ్చే, చీడపీడలను తట్టుకునే విత్తనాలను విత్తుకోవాలని సూచించారు. మంథని ఏడీఏ అంజని, శాస్త్రవేత్తలు వెంకన్న, కిరణ్‌, సురేశ్‌, బాబ్జీ, పాల్‌యాదవ్‌, గిరీశ్‌, ఏవో రామకృష్ణ, జ్యోతి, అనూష, శ్వేత పాల్గొన్నారు.

పొగాకు ఉత్పత్తులు హానికరం1
1/3

పొగాకు ఉత్పత్తులు హానికరం

పొగాకు ఉత్పత్తులు హానికరం2
2/3

పొగాకు ఉత్పత్తులు హానికరం

పొగాకు ఉత్పత్తులు హానికరం3
3/3

పొగాకు ఉత్పత్తులు హానికరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement