
మహిళల ఆర్థికాభివృద్ధికి కుట్టు శిక్షణ దోహదం
రామగిరి(మంథని): మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఉచిత కుట్టు శిక్షణ దోహదపడుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావు అన్నారు. మండలంలోని కల్వచర్ల గ్రామంలో రేండ్ల శారద కుమార్స్వామి దంపతులు సుమారు 300 మందికి ఉచిత కుట్టు శిక్షణ అందించి న్యాక్ ఆధ్వర్యంలో శుక్రవారం పరీక్షలు నిర్వహించారు. సదరు మహిళలకు డీఎంహెచ్వో అన్నప్రసన్న కుమారి, డీపీవో వీరబుచ్చయ్యతో కలిసి సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం రేవతిరావు మాట్లాడుతూ, గ్రామంలోని మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించాలని ఉచిత కుట్టు శిక్షణతో పాటు పరికరాలు అందజేయడం, న్యాక్ ద్వారా ప్రతి మహిళకు రుసుము చెల్లించి పరీక్షలు నిర్వహించడంతో పాటు సర్టిఫికెట్లు అందజేస్తున్న శారదకుమార్స్వామి దంపతుల సేవలు భేష్ అని కొనియాడారు. కార్యక్రమంలో రేండ్ల కొమురయ్య, బూస బాపు, కస్ప కవిత, మహేందర్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు శ్రీనివాస్ పాల్గొన్నారు.