
పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: భూ సంబంధిత సమస్యలను భూభారతి చట్టం ద్వారా పారదర్శకంగా పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ఎలిగేడు మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో భూసమస్యలపై స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సేత్వార్కు సంబంధించిన సమస్యలే ఎక్కువగా వచ్చాయని వివరించారు. 2020 సంవత్సరం వరకు సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకున్న సమస్యలనే పరిష్కరించాలని కొత్తగా సాదాబైనామా దరఖాస్తులు తీసుకోవద్దన్నారు. జూన్ 3నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సులకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తిరస్కరించే దరఖాస్తులకు కారణాలను స్పష్టంగా చెప్పాలన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు దృష్టికి వస్తే కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, సర్వే ల్యాండ్రికాడ్స్ఏడీ శ్రీనివాసులు తదితరులున్నారు.