
కాంగ్రెస్తోనే పేదలకు న్యాయం
సుల్తానాబాద్/జూలపల్లి: పథకాల పేరిట నాయకులు డబ్బు వసూలు చేస్తే రానున్న స్థానిక ఎన్నికల్లో టికెట్ కట్ చేసుడేనని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్లో రూ.60 లక్షలతో కొనుగోలు చేసిన 2 ట్రాక్టర్లు, ట్రాలీలను శనివారం ప్రారంభించి మాట్లాడారు. అవినీతి లేకుండా పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని తెలుపాల్సిన అవసరం ఉందని వివరించారు. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్, సీవో స్వరూప, మేనేజర్ అలీమొద్దీన్, ఏఎంసీ చైర్మన్ మినూపాల ప్రకాష్ రావు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
గడువులోగా స్టిచ్చింగ్ చేయాలి
మహిళా సంఘాలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘానికి అందించిన ఆటోను శనివారం ప్రారంభించి మాట్లాడారు. మండల కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మహిళ సంఘాల సభ్యులకు కుట్టుమిషన్ శిక్షణ ఇవ్వడం జరిగిందని, వారితో విద్యార్థుల డ్రెస్సులను స్టిచ్చింగ్ చేయించి గడవులోగా అందజేయాలని కోరారు.
పేదింటి ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం
పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. శనివారం మండలంలోని కోనరావుపేట, జూలపల్లి మార్కెట్యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. స్థానిక ఫంక్షన్హాలులో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. తహసీల్దార్ స్వర్ణ, పీఏసీఎస్ చైర్మన్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
● ఎమ్మెల్యే విజయరమణారావు