పార్వతీపురం: రాబోయే రోజుల్లో జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంద ని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ వడగాల్పుల ప్రభావం దృష్ట్యా అత్యవసరమై తే తప్ప బయటకు వెళ్లకుండా, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయ టపనులను వాయిదా వేసుకోవాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరో గ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్, మందులు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.


