రేబిస్‌ వ్యాధితో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రేబిస్‌ వ్యాధితో వ్యక్తి మృతి

Oct 2 2025 8:07 AM | Updated on Oct 2 2025 8:07 AM

రేబిస్‌ వ్యాధితో వ్యక్తి మృతి

రేబిస్‌ వ్యాధితో వ్యక్తి మృతి

రేబిస్‌ వ్యాధితో వ్యక్తి మృతి

● భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు

కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

సంతకవిటి: మండలంలోని గోవిందపురం గ్రామానికి చెందిన అదపాక లింగంనాయుడు(37) రేబిస్‌ వ్యాధితో సోమవారం మృతిచెందాడు. ఆయనకు ఆగస్టు 30న కుక్క కరవడంతో సంతకవిటి పీహెచ్‌సీకి వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకున్నాడు. ఇటీవల అనారోగ్యం బారిన పడడంతో శనివారం శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లగా రేబిస్‌ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించి, మెరుగైన చికిత్స కోసం వైజాగ్‌ రిఫర్‌ చేయడంతో ఆదివారం వైజాగ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈయన మృతితో గ్రామస్తులు భయాందోళన చెంది గ్రామంలో కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement