వైఎస్సార్‌సీపీలోకి జనసేన నాయకుడు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి జనసేన నాయకుడు

Aug 1 2025 12:15 PM | Updated on Aug 1 2025 12:15 PM

వైఎస్సార్‌సీపీలోకి జనసేన నాయకుడు

వైఎస్సార్‌సీపీలోకి జనసేన నాయకుడు

దత్తిరాజేరు: జనసేన పార్లమెంటరీ కమిటీ సభ్యుడు, గజపతినగరం నియోజకవర్గం నాయకుడు సామిరెడ్డి లక్ష్మణ్‌ ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో గురువారం చేరారు. ఆయన స్వగ్రామం దత్తిరాజేరు మండలం పెదకాద నుంచి మరో 50 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీ తీర్థం తీసుకున్నారు. మాజీ ఉప సర్పంచ్‌ మత్స వెంకన్న, సామిరెడ్డి తవిటినాయుడు, కూర్మినాయుడు, వైకంఠం శ్రీరాం తదితరులను మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తన ఇంటివద్ద పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్షణ్‌ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలంటే ఒక్క వైఎస్సార్‌సీపీలోనే సాధ్యమని, బొత్స అప్పలనర్సయ్య నాయకత్వంలో ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గేదెల సింహాద్రిఅప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు రాపాక కృష్ణార్జున, వైఎస్‌ ఎంపీపీలు బమ్మిడి అప్పలనాయుడు, మిత్తిరెడ్డి రమేష్‌, నాయకులు మహదేవ్‌ ఫణీంద్రుడు, మండల శ్రీను, చుక్క మురళి, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

పెదకాద నుంచి సామిరెడ్డి లక్ష్మణ్‌తో పాటు 50 కుటుంబాలు చేరిక

పార్టీ కండువా వేసి ఆహ్వనించిన

మాజీ ఎమ్మెల్యే బొత్స

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement