
యోగాంధ్ర పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపాలి
పార్వతీపురం టౌన్: యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమాల్లో బాగంగా జిల్లా స్థాయి యోగా పోటీలను నిర్వహించినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలను పర్యవేక్షించారు. జిల్లాలోని వివిధ మండల,పట్టణ స్థాయి యోగాంధ్ర పోటీల్లో గెలుపొందిన వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో యోగా పోటీలు నిర్వహించామన్నారు.యోగా చిత్రలేఖనం, సాంగ్స్, ఎస్సే, గ్రూప్ యోగా ప్రదర్శనలను ఆయన పరిశీలించారు. యోగా గురు మోహన్ గంతాయత్ బృందంతో కూడిన ఐదుగురు సభ్యులు జిల్లా స్థాయి పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. జిల్లా పోటీల్లో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హులన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందినవారు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు, హోమియో వైద్యురాలు డా.సుశీల,జిల్లా కన్సల్టెంట్ డా రఘు,యోగా మాస్టర్స్ మోహన్ గంతాయత్, జనార్దన రావు, డా.హేమాక్షి, డా.వర్మ, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు