
అలసత్వంతో అవినీతి
జిల్లా వ్యాప్తంగా ఉన్న నీటి ప్రాజెక్టులకు సంబంధించిన పంటకాలువల్లో పూడికలు తీసే పనులు జనవరి నుంచి మే మాసం లోపే అధికారులు పూర్తి చేసి వర్షాకాలానికి సన్నద్ధం కావాలి. ఈ పనులేవీ చేయకుండా వర్షాకాలం వచ్చిన తరువాత నిధులు కేటాయించి కాలువల్లో వరదనీరు ఉంటుంది కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ నిధులను దుర్వినియోగం చేసేందుకు అధికారులు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపిణలు వినిపిస్తున్నాయి. ఇటీవల తోటపల్లి కాలువకు సంబంధించిన పనుల్లో ఓ అధికారి పనులు నిర్వహించకుండానే ఎం బుక్లు చేసి నిధులు ఏవిధంగా తారుమారు చేశారో తెలిసిందే. ఇదే వైఖరిని అధికారులు కొనసాగిస్తున్నారు.
– ఎం.కృష్ణమూర్తి, రైతుసంఘం నాయకుడు