రంజాన్‌ ప్రార్థనలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రంజాన్‌ ప్రార్థనలకు సర్వం సిద్ధం

Mar 21 2026 5:20 AM | Updated on Mar 21 2026 5:20 AM

రంజాన్‌ ప్రార్థనలకు సర్వం సిద్ధం చిలకలూరిపేట: రంజాన్‌ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్‌లో ఉన్న ఈద్గా మైదానం వద్ద పారిశుధ్య పనులను శుక్రవారం నిర్వహించారు. ప్రతి ఏటా రంజాన్‌ సందర్భంగా పట్టణంలో ఉన్న ఈద్గా మైదానంలో నమాజు కోసం వేలాదిగా ముస్లింలు హాజరవుతారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈద్గా ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. ట్యాంకర్లతో నీటిని తెప్పించి మైదానాన్ని కడిగించి శుభ్రపరిచారు. ఏర్పాట్లను మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ రఫాని, అంజుమన్‌ ఇస్లామియా కమిటీ అధ్యక్షుడు షేక్‌ జాన్‌పీర్‌ సాహెబ్‌ కమిటీ సభ్యులు, ముస్లిం పెద్దలు పరిశీలించారు. శనివారం ఉదయం 8 గంటలకు ముఫ్తీ ఖలీల్‌ఖాన్‌ రంజాన్‌ సందేశం(బయాన్‌) ఇస్తారని, 9 గంటలకు ముఫ్తీ అనస్‌ఖాన్‌, రంజాన్‌ ప్రార్ధనలు(నమాజ్‌) నిర్వహింపచేస్తారని అంజుమన్‌ ఇస్లామియా కార్యదర్శి షేక్‌ అహ్మద్‌ తెలిపారు. ముగిసిన బాజీబాబా ఉరుసు మహోత్సవం

భక్తులకు గంధం పంపిణీ చేసిన నిర్వాహకులు సాయంత్రం నాలుగు గంటల వరకు గ్రామోత్సవం

పెదకాకాని: బాజీబాబా దర్గా రెండు రోజుల ఉరుసు మహోత్సవం శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలతో ముగిసింది. పెదకాకాని సయ్యద్‌ బాజీ షహీద్‌ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్‌బోర్డు అధికారులు మహ్మద్‌ హుస్సేన్‌, దర్గా ఈఓ షేక్‌ ఖాజావలిలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్గా ఉరుసు మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో భాగంగా పెదకాకాని పొలిమేర సెంటర్‌ నుంచి ప్రత్యేక చాందినీ అలంకరణలో గంధం బిందెలతో గురువారం రాత్రి ప్రారంభమైంది. బాజీబాబా వారి గుర్రం శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకూ వెనిగండ్ల, పెదకాకాని గ్రామ పురవీధులలో గ్రామోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు బాజీబాబా వారి గుర్రానికి మిఠాయిలు, పండ్లు తినిపించారు. కొబ్బరికాయలు, పూలు, గంధం సమర్పించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. బాబావారి గుర్రం దర్గాలోకి చేరుకోగాలనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, భక్తులకు గంధం పంపిణీ చేశారు. గంధం పంపిణీ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో రద్దీ వాతావరణం నెలకొంది. భక్తులందరికీ గంధం పంపిణీ జరిగిందని వక్ఫ్‌బోర్డు ఈఓ షేక్‌ ఖాజావలి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement