ప్రాధాన్యాన్ని వివరిస్తున్నాం
వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో వైద్య సదుపాయాలు లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జగన్మోహన్రెడ్డి హయాంలో గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద మెడికల్ కళాశాలను నిర్మాణం చేసి పేదలకు మెరుగైన వైద్యంతోపాటు నిరుపేద విద్యార్థులకు మెడికల్ చదివే అవకాశం కల్పించేందుకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పీపీపీ విధానంతో కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పగించే పనిలో ఉన్నారు. నిరసనగా మేము చేపట్టే సంతకాల సేకరణలో మెడికల్ కళాశాల ఉంటే ప్రజలకు అందించే వైద్య సేవలు, వాటి ప్రాముఖ్యతను తెలుపుతున్నాం. – డేగల సునీల్ కుమార్, గురజాల


