హింసాత్మక సినిమాలు తీసేవాళ్లు సాంస్కృతిక నేరస్తులు | - | Sakshi
Sakshi News home page

హింసాత్మక సినిమాలు తీసేవాళ్లు సాంస్కృతిక నేరస్తులు

Dec 7 2025 8:40 AM | Updated on Dec 7 2025 8:40 AM

హింసాత్మక సినిమాలు తీసేవాళ్లు సాంస్కృతిక నేరస్తులు

హింసాత్మక సినిమాలు తీసేవాళ్లు సాంస్కృతిక నేరస్తులు

హింసాత్మక సినిమాలు తీసేవాళ్లు సాంస్కృతిక నేరస్తులు ● ‘తెలుగుభాష– సాహిత్యం–వ్యక్తిత్వ వికాసం’ అంశంపై డాక్టర్‌ పాపినేని శివశంకర్‌ మాట్లాడుతూ ప్రతి మాట చివరలో అచ్చులు వచ్చే విభిన్నత వల్ల తెలుగు భాష పలకటం సులువుగా, వినసొంపుగా ఉంటుందని చెప్పారు. విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్‌ చందు సాంబశివరావు మాట్లాడుతూ తెలుగు భాష, తెలుగు సాహిత్యం ఎందుకు అవసరమని ప్రజాప్రతినిధులు మాట్లాడటం శోచనీయమన్నారు. ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు చందు సుబ్బారావు అధ్యక్షత వహించిన సభలో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ తెలుగు ఆచార్యులు నారిశెట్టి వెంకట కృష్ణారావు, చింతల శ్రీనివాసరావు, మొవ్వా సత్యనారాయణ, బొల్లిముంత కృష్ణ పాల్గొన్నారు. సభానంతరం తెలుగు కవి సమ్మేళనం నిర్వహించారు.

తెనాలి: రక్తం కనబడకుండా, ఆయుధం కనిపించకుండా, హింస లేకుండా ఏ తెలుగు సినిమా అయినా వుందా? ఎంత దుర్మార్గమిది...! ఎంత సాంస్కృతిక నేరస్తులు వీళ్లు, సినిమాలు తీసేవాళ్లు...వేషాలు వేసేవాళ్లు అని ప్రముఖ రచయిత, కవి, విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్‌ అన్నారు. సినిమాల్లో ఒక్కోడు వందమందిని చంపటం, ఏ నేరారోపణ లేకుండా బయటకెలా వస్తారు... ఆలోచించాలని చెప్పారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో రెండురోజుల తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాన్ని శనివారం మండల తహసీల్దార్‌ కేవీ గోపాలకృష్ణ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement