
టెయిల్ పాండ్ ప్రాజెక్టు మూడు క్రస్ట్గేట్లు ఎత్తివేత
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ మూడు క్రస్ట్గేట్లు, రెండు యూనిట్ల ద్వారా 29,803 క్యూసెక్కులను పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం ఆదివారం తెలిపారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు 3 క్రస్ట్గేట్లు 1.5 మీటర్లు ఎత్తు ఎత్తి 21,258 క్యూసెక్కులు, రెండు యూనిట్లు ద్వారా 8,545 క్యూసెక్కులు మొత్తం 29,803 క్యూసెక్కులను దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటి మట్టం 75.50 మీటర్లకు గాను 75.50 మీటర్లకు నీరు చేరుకుందని రిజర్వాయర్లో గరిష్ట స్థాయిలో 7.080 టీఎంసీలకు గాను 7.080 టీఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు. టీఆర్సీ లెవల్ 55.68 మీటర్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం ఎగువ నున్న నాగార్జునసాగర్ నుంచి 34,185 క్యూసెక్కుల నీరు వస్తుందని పై నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామన్నారు.
పులిచింతలకు 29,803 క్యూసెక్కులు విడుదల