ముగిసిన ఏఎన్‌యూ ఇంటర్‌ కాలేజియేట్‌ బేస్‌బాల్‌ మెన్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఏఎన్‌యూ ఇంటర్‌ కాలేజియేట్‌ బేస్‌బాల్‌ మెన్‌ టోర్నీ

Published Sat, Mar 22 2025 2:03 AM | Last Updated on Sat, Mar 22 2025 1:58 AM

గుంటూరు రూరల్‌: క్రీడా స్ఫూర్తి జీవితంలో ఉన్నస్థాయికి చేరుస్తుందని ఆర్‌వీఆర్‌జేసీ ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌.శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్‌, డాక్టర్‌ జగదీష్‌ మద్దినేనిలు తెలిపారు. రెండు రోజులుగా చౌడవరం గ్రామంలోని కళాశాలలో జరుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల బేస్‌ బాల్‌ (మెన్‌) టోర్నమెంట్‌ శుక్రవారంతో ముగిసింది. ఆర్‌వీఆర్‌జేసీ కళాశాల జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి, విన్నర్‌ ట్రోఫీని కై వసం చేసుకుంది. రన్నర్‌ ట్రోఫీని ఏఎన్‌యూ ఫిజికల్‌ కళాశాల జట్టు సాధించింది. తృతీయ స్థానంలో ఎంఏఎం పీజీ కాలేజీ, నాలుగో స్థానంలో సీఆర్‌ కాలేజీ జట్లు నిలిచి ట్రోఫీలను అందుకున్నాయి. టోర్నమెంట్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులతో ఏఎన్‌యూ సాఫ్ట్‌ బాల్‌ (మెన్‌) జట్టును సెలెక్షన్‌ కమిటీ సభ్యులు ఎంపిక చేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్‌ ఆర్‌. గోపాలకృష్ణ, ట్రెజరర్‌ డాక్టర్‌ కె. కృష్ణప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె. రవీంద్ర, ఏవో డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్వీ శ్రీనివాసరావు, పీడీలు డాక్టర్‌ పి. గౌరీశంకర్‌, డాక్టర్‌ ఎం.శివరామకృష్ణ, ఏఎన్‌యూ టోర్నమెంట్‌ ఆబ్సర్వర్‌ డాక్టర్‌ సూర్యనారాయణ, సెలెక్షన్‌ కమిటీ మెంబర్స్‌ డాక్టర్‌ పీ శ్రీనివాస్‌, డాక్టర్‌ ఎం. బుచ్చిబాబు, డాక్టర్‌ రాజామెరిసిన్‌ బాబు, జె.ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement