జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో గురువారం ఒడిశా పక్షం, సంప్రదాయ దుస్తుల దినాన్ని అత్యంత ఉత్సాహంతో నిర్వహించారు. ఈ ఉత్సవంలో విశ్వవిద్యాలయ కులపతి మహేశ్వర చంద్ర నాయిక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహేశ్వర నాయిక్ ప్రసంగిస్తూ ఒడియా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించటం, ప్రోత్సహించటం ఈ ఉత్సవం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. అంతే కాకుండా సమాజానికి ఒడిశా మూల సంస్కృతిని ఆచరించటం ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో అలరించారు. అనంతరం ముగ్గురు జర్నలిస్టులను సత్కరించారు.


