భువనేశ్వర్: స్థానిక ఆంధ్ర సాంస్కృతిక సమితి ప్రధాన వార్షిక ఉత్సవం శ్రీరామనవమి వేడుకల్లో గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఆయన సతీమణి జయశ్రీ కంభంపాటితో కలిసి పాల్గొన్నా రు. సమితి ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో గవర్నర్ దంపతు లు ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు. రాష్ట్రం, దేశంలో శాంతి, సామరస్యం, సుసంపన్నత వెల్లివిరియా లని గవర్నర్ ఆకాంక్షించారు. గవర్నర్ దంపతుల సందర్శనను ఏసీఏ అధ్యక్షుడు గన్నవరపు ఆనంద రావు, కార్యదర్శి ఆర్. సత్య సాయి పర్యవేక్షించారు.


