రాజ్యాంగ పరిరక్షణకే రాహుల్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పరిరక్షణకే రాహుల్‌ పర్యటన

Jul 9 2025 7:34 AM | Updated on Jul 9 2025 7:34 AM

రాజ్యాంగ పరిరక్షణకే రాహుల్‌ పర్యటన

రాజ్యాంగ పరిరక్షణకే రాహుల్‌ పర్యటన

కొరాపుట్‌: రాజ్యాంగ పరిరక్షణ కోసమే రాష్ట్రానికి రాహుల్‌ గాంధీ వస్తున్నారని కొరాపుట్‌ డీసీసీ కో ఆర్డినేటర్‌ శశి భూషణ్‌ బెహరా పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జయపూర్‌ మెయిన్‌ రోడ్డులోని కొరాపుట్‌ జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన భువనేశ్వర్‌లో రాజ్యాంగ పరిరక్షణ సభ జరుగుతుందన్నారు. ఈ సభకి రాహుల్‌తోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, తదితరులు వస్తారన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, పేదలకు అందని సంక్షేమ పథకాలు, తదితర అంశాలపై ఈ సభలో నిరసన గళం వినిపిస్తామని శశి భూషణ్‌ బెహరా పేర్కొన్నారు.

ఈ సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజ్‌ గంగ్‌ పూర్‌, ఎమ్మెల్యే పి.ఎస్‌.రాజన్‌ హిక్కా, చిత్ర కొండ ఎమ్మెల్యే మంగులు కిలో, జయపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ నొరి మహంతి, నాయకుటు నిమయ్‌ సర్కార్‌, రుపక్‌ తురుక్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement