
మహిళా చట్టాలపై అవగాహన
జయపురం: మహిళా చట్టాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని వక్తలు అన్నారు. వర్కింగ్ మహిళల వేధింపు, ఎస్టీ, ఎస్సీ అత్యాచార చట్టం 1989పై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు న్యాయ చైతన్య శిబిరాన్ని గోపాలకృష్ణ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో గౌరహరి విహార్, రాణిపుట్లో జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం నిర్వహించిన సచేతన శిబిరాన్ని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మహంతి పర్యవేక్షణలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా లోక్ అదాలత్ శాశ్వత విచారపతి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి సుమన్ జెన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో ఉద్యోగాలు పొందిన మహిళలపై శారీరిక వేధింపుల నియంత్రణకు, అభ్యంతర అభియోగ కమిటీ ఏర్పాటు జరుగుతుందని మహిళలకు రక్షణ కల్పించే చట్టాలపైన, సోస్కొ చట్టాలపై వివరించారు. గోపాల కృష్ణ ఇంజినీరింగ్, టెక్నాలజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.

మహిళా చట్టాలపై అవగాహన