ఎమ్మెల్యే కడ్రక ఔదార్యం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కడ్రక ఔదార్యం

Apr 29 2025 9:41 AM | Updated on Apr 29 2025 9:41 AM

ఎమ్మెల్యే కడ్రక ఔదార్యం

ఎమ్మెల్యే కడ్రక ఔదార్యం

రాయగడ: రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్ర క మానవత్వాన్ని చాటుకున్నారు. స్థానిక ఫ్‌లై ఓవర్‌ బ్రిడ్జిపై కొందరు వృద్ధులు సోమవారం మధ్యా హ్నం నడుచుకుంటూ వెళుతుండటం చూసి తన వాహనాన్ని ఆపి వారిని కలిశారు. ఎక్కడకు వెళుతు న్నారని ఆరా తీశారు. ఇంత ఎండలో నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఏమిటని అడిగారు. తా ము సదరు సమితి పరిధి తడమ పంచాయతీలోని లుహాకాల్‌ గ్రామం నుంచి వచ్చామని వారంతా సమాధానం చెప్పారు. పింఛన్‌ తీసుకునేందుకు తా మంతా 11 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామని వివరించారు. ఆటో కొసం పడికాపులు కాచినప్పటి కీ లభించకపోవడంతో గత్యంతరం లేక నడుచుకుంటూ సమీపంలోని కొత్తబస్టాండుకు వెళుతున్నామని చెప్పారు. వివరాలు సేకరించిన ఎంఎల్‌ఏ కడ్రక ఆటోలను రప్పించి వారి వారి గ్రామాలకు తరలించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న పెన్సన్‌ ను ఇటువంటి తరహా వృధ్దులకు ఇంటికి తీసుకువెళ్లి ఇచ్చే సౌకర్యం కల్పించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానని ఈ సందర్భంగా కడ్రక చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement