నిత్యానంద గొండోకు కీలక శాఖలు
–8లోu
నష్టాల్లో పైనాపిల్ యూనిట్లు
ప్రస్తుత సీజన్లోవిరివిగా లభించే పైనాపిల్ పండ్లకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొరాపుట్: అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి రాష్ట్ర మంత్రి వర్గంలో ఏకై క మంత్రిగా ఉన్న నిత్యానంద గొండోకి నూతన మంత్రివర్గంలో సుముచిత స్థానం లభించింది. ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మజ్జి ప్రకటించిన జాబితాలో అనేక శాఖలు లభించాయి. రాష్ట్ర స్కూల్స్, మాస్ ఎడ్యుకేషన్, సాంఘిక సంక్షేమ శాఖ, మైనారిటీ, వెనుకబడిన తరగతుల సంక్షేమం, సామాజిక భద్రత, దివ్యాంగుల ఉపాధి అభివృద్ధి, హరిజన, గిరిజన శాఖలు లభించాయి. వీటితో పాటు క్యాబినెట్ హోదా కల్పించారు. భారీగా పదవులు రావడం పట్ల అవిభక్త కొరాపుట్ జిల్లాలో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వెనుక బడిన అవిభక్త కొరాపుట్ జిల్లాలు షెడ్యూల్డ్ ప్రాంతంలోనివి. ఇక్కడ 90 శాతం పైగా ప్రజలు గిరిజనులే. ఈ నేపథ్యంలో నిత్యానందకు పదవులు దక్కడంతో జిల్లా అభివృద్ధి చెందే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment