ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టి

Apr 21 2026 6:13 AM | Updated on Apr 21 2026 6:13 AM

● జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ లక్ష్మీశ ● ప్రజల నుంచి 113 అర్జీలు స్వీకరణ ● తాడేపల్లి వద్ద పోలవరం కుడి కాలువ గట్టు మట్టిని తరలిస్తున్నారు. కట్టకు 25 అడుగుల లోతుకు తవ్వారు. వర్షాకాలం కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది. అధికారులు సత్వరం స్పందించి కట్టను పరిరక్షించాలి. మట్టి అక్రమ రవాణా నిలిపివేయాలి. మట్టి తరలింపు సమయంలో ధుమ్ము, దూళి లేచి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారంటూ గ్రామస్తులు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇచ్చారు. ● వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో వందల ఏళ్ల నుంచి క్రైస్తవ శ్మశాన వాటిక ఉంది. ఈ శ్మశానవాటిక వెనుక వైపు పొలం ఉన్న గుంటి కన్నయ్య అనే వ్యక్తి వాటికలోని సమాధులను కూల్చివేశాడు. సమాధులన్నింటిని ధ్వంసం చేసి వాటికను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రైస్తవ శ్మశాన వాటికను కాపాడాలంటూ గ్రామస్తులు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ పెట్టుకున్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జిల్లాస్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం జరిగింది. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్‌ అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఓర్పుతో విని సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. ఏ ఒక్క అర్జీని నిర్లక్ష్యం చేయకుండా, నిర్దిష్ట గడువులో పరిష్కరించడం ద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అదే విధంగా అర్జీల పరిష్కారంలో ఆలస్యం, నిర్లక్ష్యం, లేదా అసంతృప్తికర స్పందనకు తావులేకుండా పనిచేయాలని హెచ్చరించారు. జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో మొత్తం 113 అర్జీలు వచ్చాయి. వీటిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 26, పోలీసు శాఖకు 20, పంచాయతీరాజ్‌కు 15, రెవెన్యూకు 17 అర్జీలు ఉన్నాయి.

వచ్చిన అర్జీల్లో కొన్ని..

Advertisement
 
Advertisement
Advertisement