ఘంటసాలలో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఘంటసాలలో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

Mar 29 2026 6:50 AM | Updated on Mar 29 2026 6:50 AM

ఘంటసాల: దేశంలోని ప్రతి పౌరుడికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం వంటి హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అని అంబే డ్కర్‌ మనవడు, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ భీమ్‌ రావ్‌ యశ్వంత్‌ అంబేడ్కర్‌ అన్నారు. ఘంటసాలలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఏపీ అధ్యక్షుడు ఉప్పులేటి దేవీప్రసాద్‌తో కలసి ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యశ్వంత్‌ అంబేడ్కర్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పల్లె, నగరంలో అంబేడ్కర్‌ విగ్రహాలు ఉండటం ఇక్కడి ప్రజలకు ఆయనపై ఉన్న అపారమైన గౌరవానికి నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య మాట్లా డుతూ.. ఎస్సీలు క్రైస్తవులైతే ఎస్సీ రిజర్వేషన్లు చెల్లవంటూ ఉన్నత న్యాయ స్థానం తీర్పు ఇవ్వడం సమంజసమా అని ప్రశ్నించారు. ఢిల్లీస్థాయిలో గొంతు వినిపించి ఎస్సీలకు రక్షణ కల్పించాలన్నారు. ముందుగా ఘంటసాల వారసత్వ విగ్రహాల నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. సభావేదిక వద్ద బౌద్ధ సంప్రదాయాలతో భంతే ధమ్మ ధజ థెరో ప్రత్యేక పూజలు చేసి అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ చేయించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు, వైఎస్సార్‌ సీపీ నాయకులు వేమూరి వెంకట్రావు, వేమూరి ప్రవీణ్‌, నలకుర్తి సురేష్‌, జుజ్జువరపు భాగ్యారావు, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ గొర్రెపాటి రామకృష్ణ, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు పంత గాని రమేష్‌, కృష్ణాజిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్‌, తూమాటి బసవ సుధాకర్‌, కోటే రామ్‌నాథ్‌, గద్దె కోటినాగులు, ఏపీ న్యాయశాఖ జాయింట్‌ సెక్రటరీ వెలగపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement