‘మిస్టర్ వర్క్ ఫ్రం హోం’ సందడి
లబ్బీపేట(విజయవాడతూర్పు): వ్యవసాయానికి ఆధునిక టెక్నాలజీని అనుసంధానిస్తే ఎలా ఉంటుందో వెండి తెరపై ‘మిస్టర్ వర్క్ ఫ్రం హోం’ చిత్రంలో ప్రేక్షకులకు చూపించనున్నామని హీరో త్రిగుణ్ తెలిపారు. వచ్చే వారం ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నామని, ఆదరించాలని కోరారు. బెంజి సర్కిల్ సమీపంలోని ఒక హోటల్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో త్రిగుణ్ మాట్లాడుతూ.. తాను నటించిన ఈశా చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేశారన్నారు. వ్యవసాయం కథాంశంతో మిస్టర్ వర్క్ ఫ్రం హోం చిత్రంతో మళ్లీ ప్రేక్షకులు ముందుకు వస్తున్నాని చెప్పారు. ఇంజినీరింగ్ చదివిన యువకుడు వ్యవసాయం ఎందుకు చేయాలనే కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించామన్నారు. కార్యక్రమంలో హీరోయిన్ పాయల్, దర్శకుడు మధుదీప్, నిర్మాత అరవింద్ పాల్గొన్నారు.


