జీఎస్టీ తగ్గింపుతో భవన నిర్మాణ కార్మికులకు మేలు | - | Sakshi
Sakshi News home page

జీఎస్టీ తగ్గింపుతో భవన నిర్మాణ కార్మికులకు మేలు

Oct 15 2025 5:30 AM | Updated on Oct 15 2025 5:30 AM

జీఎస్టీ తగ్గింపుతో భవన నిర్మాణ కార్మికులకు మేలు

జీఎస్టీ తగ్గింపుతో భవన నిర్మాణ కార్మికులకు మేలు

అవనిగడ్డ: జీఎస్టీ తగ్గింపుతో నిర్మాణ రంగానికి, భవన నిర్మాణ కార్మికులకు ఎంతో మేలు జరిగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. అవనిగడ్డ రెవెన్యూ హాలులో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ ఆధ్వర్యంలో సూపర్‌ జీఎస్టీ – సూపర్‌ సేవింగ్స్‌ అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. ముఖ్య అతిథి, మంత్రి సుభాష్‌ మాట్లాడుతూ.. సిమెంటుపై పది శాతం, వెదురు ఫ్లోరింగ్‌పై ఏడు శాతం, మార్బుల్స్‌, గ్రానైట్‌, ఇసుక, ఇటుకపై ఏడు శాతం జీఎస్టీ తగ్గిందని తెలిపారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపు సంచలనాత్మక నిర్ణయమని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ కుమార్‌, జీఎస్టీ ప్రచార కమిటీ డిస్ట్రిక్ట్‌ కో–ఆర్డినేటర్‌, జాయింట్‌ కమిషనర్‌ జి.కల్పన, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, డెప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్‌ స్వరూపరాణి పాల్గొన్నారు.

నిర్మాణ రంగానికి జీఎస్టీ 2.0 చేయూత

పమిడిముక్కల: నిర్మాణ రంగానికి జీఎస్టీ 2.0 చేయాతనిస్తుందని కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్‌ పేర్కొన్నారు. వీరంకిలాకులో సూపర్‌ జీఎస్టీ సూపర్‌ సేవింగ్స్‌పై ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజా ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement