అమ్మవారికి బోనాలు | - | Sakshi
Sakshi News home page

అమ్మవారికి బోనాలు

Jul 21 2025 7:59 AM | Updated on Jul 21 2025 7:59 AM

అమ్మవారికి బోనాలు

అమ్మవారికి బోనాలు

దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలోని శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా అమ్మవారు పూల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మ వారికి 1000 మంది మహిళలు బోనాలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈఓ కె.సునీల్‌కుమార్‌ పర్యవేక్షించారు.

శాకంబరిగా భ్రమరాంబ అమ్మవారు

పెదకాకాని: శివాలయంలో భ్రమరాంబ అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పెదకాకాని శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ అమ్మవారిని కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌, సుగంధ ద్రవ్యాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం, ధ్వజస్తంభం వద్ద ఆకుకూరలు, కూరగాయల తోరణాలతో అలంకరించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్‌ గోగినేని లీలాకుమార్‌ పర్యవేక్షణలో అర్చకులు, వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. విఘ్నేశ్వరుణ్ణి, నందీశ్వరుడిని, ప్రసన్నాంజనేయస్వామిని, శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని కూడా అలంకరించారు. ప్రత్యేక దర్శనం, అన్న ప్రసాదం ఏర్పాట్లు చేసినట్లు డీసీ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ దంపతులు ఆషాఢ సారె సమర్పించి, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక గ్రామ పెద్దలు, భక్తులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం కూడా అమ్మవారు భక్తులకు శాకంబరిగా దర్శనమివ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement