తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీటెక్ మొదటి సెమిస్టర్ ఫలితాలపై పున:పరిశీలనకు విద్యార్థులు ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్–ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్– ఇంజ నీరింగ్ విద్యార్థులు పున:పరిశీలనకు ప్రతి పేపర్కు చలాన్ ద్వారా రూ.800లు చెల్లించి దరఖా స్తు ఫారం (రూ.25)తో సంబంధిత పత్రాలు జత చేసి కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.


