జిల్లా కేంద్రంలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేస్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి
జనాభా లెక్కల నమోదు కోసం చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయగణన) ఆదివారం ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తమ వివరాలను మొదటి రోజే ఆన్లైన్లో నమోదు చేసి కార్యక్రమ ప్రాధాన్యతను తెలియజెప్పారు. ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీ అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ కూరగాయల ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తమ వివరాలను సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్నారు. – నిజామాబాద్ అర్బన్/నిజామాబాద్ రూరల్


