● ఖరీఫ్లో మేలు రకాలను సాగు చేయాలంటున్న వ్యవసాయ శాఖ
డొంకేశ్వర్ (ఆర్మూర్): త్వరలో వానాకాలం సీజన్ (ఖరీఫ్) ప్రారంభం కానున్న నేపథ్యంలో వరిలో మేలు రకాలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ రైతులకు సూచిస్తోంది. స న్నాల్లో చాలా రకాలను సాగు చేయడంతో ప్ర భుత్వం సూచించిన విధంగా గింజలో ప్రమాణాలు ఉండటం లేదని, ధృవీకరించబడిన ప లు మేలు రకాలను మాత్రమే సాగు చేయాల ని చెబుతోంది. దీంతో రైతులకు, రైస్ మిల్లర్ల కు ఇబ్బందులు ఉండవని అంటున్నారు. ఖరీఫ్లో గంగాకావేరి, ఎంటీయూ–1224, 1001, 1153, 1156, జేజీఎల్–24423 వంటి రకాలు సాగు చేయడంతో గింజ పొడవులో వ్యత్యాసం, మిల్లింగ్ సమయంలో నూక వస్తోందని ఫిర్యాదులు ఉన్నాయి. ఒక్కోసారి మిల్లర్లు ధాన్యాన్ని దింపుకోవడం లేదు. పైన సూచించిన రకాలను సాగు చేయడం తగ్గించాలని, మేలైన 11 రకాల వరి సాగు చేయ డం ఉత్తమమని అధికారులు చెప్తున్నారు.
మేలు రకాలు ఇవే..


