తెయూ(డిచ్పల్లి): తెయూ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్ష లు కొనసాగుతున్నాయి. శుక్రవారం కామారెడ్డిలోని సెంటర్లో ఓ వి ద్యార్థి మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 29 పరీక్ష కేంద్రాల్లో 11,238 విద్యార్థులకు 10,773 మంది హాజరు కాగా 465 మంది గైర్హాజరయ్యారు. కామారెడ్డిలోని పరీక్ష కేంద్రాలను ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్, కంట్రోలర్ సంపత్కుమార్, యూ జీసీ డీన్ సీహెచ్ ఆంజనేయులు తనిఖీ చేశారు.


