రైతులు ఏరకం వరి పండించినా అన్ని రకాలను కొనుగోలు చేయాలి. మిల్లర్లు ధాన్యంను అన్లోడింగ్ చేసుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాలి. దొడ్డు రకాలను తూకం వేయకపోవడంతో వాతావరణం మారి ఏమైనా నష్టం జరిగితే రైతుల శ్రమ వృథా అవుతుంది. – పాపాయి పవన్,
మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, మోర్తాడ్
ప్రభుత్వం పునరాలోచన
చేయాలి
దొడ్డు రకాలకే ఏ గ్రేడ్ ధర అమలు చేస్తున్నారు. దొడ్డు రకాలను కొనుగోలు చేయకపోతే అర్థమేలేదు. ప్రభుత్వం పునరాలోచన చేసి కొనుగోళ్ల కోసం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి నిరాశతో తిరిగి వస్తున్నారు.
– దడివె మోహన్, రైతు, మోర్తాడ్


