రుద్రూర్: హార్వెస్టర్ను శుభ్రం చేస్తుండగా ఓ డ్రైవర్ అనుమానాస్పదస్థితి మృతి చెందిన ఘటన కోటగిరిలో చోటుచేసుకుంది. ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు ఇలా.. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రిషిపాల్ కోషిందర్, మనోజ్ కుమార్ (డ్రైవర్)లు హార్వెస్టర్ డ్రైవర్లుగా పనిచేయడానికి కామారెడ్డి జిల్లా బీర్కూర్కు వచ్చారు. గురువారం ఉదయం మనోజ్ కుమార్ హార్వెస్టర్ను తీసుకొని, మన్నె శ్రీకాంత్తో కలిసి కోటగిరి వచ్చారు. కోటగిరిలోని వాటర్ సర్వీస్ సెంటర్లో హార్వెస్టర్ను శుభ్రం చేస్తుండగా మనోజ్ కుమార్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై రిషిపాల్ కోషిందర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు.


