● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
నిజామాబాద్ రూరల్: ఖిల్లా రామాలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందే లా చూస్తానని, రూ.10కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఖి ల్లా రామాలయంలో నిర్వ హించిన సీతారాముల కల్యాణంలో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి రాజకీయాలు పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకెళ్లాలన్నారు. రామాలయానికి రోప్వే తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేటర్లు కల్పే అర్చనా చిరంజీవి, బంటు ప్రీతి ప్రవీ ణ్, జ్యోతి మురళి, నాయకులు ఇల్లెందుల ప్రభాకర్, కృష్ణ పాల్గొన్నారు.


