నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మ ధ్యాహ్న భోజన(ఎండీఎం)కార్మికుల సమస్యలు ప రిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం మ ధ్యాహ్న భోజన పథకాన్ని పక్కదారి పట్టిస్తుందని సెంట్రలైజ్డ్ కిచెన్ విధానంతో మధ్యాహ్న భోజన ప థకాన్ని దొడ్డిదారిన ప్రయివేట్ సంస్థకు అప్పజెప్పే కుట్రలు చేస్తున్నారన్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని ఉపసంహరించుకోకపోతే అసెంబ్లీని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. నాయకులు చక్రపాణి, సాయమ్మ, గంగమణి, లత, బుచ్చవ్వ, లావణ్య, వీ రేశం, నాగలక్ష్మి, లలిత, అనసూయ పాల్గొన్నారు.


