ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
సుభాష్నగర్: మున్సిపల్ ఎన్నికలను సజావుగా ని ర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి హాజరైన సెక్యూర్ సెల్ ఆఫీసర్ మంద మకరంద్తో కలి సి కలెక్టర్ సోమవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి, డిస్ట్రిబ్యూషన్ సెంటర్తోపాటు స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాళ్లను పరిశీలించారు. పొరపాట్లకు తా వులేకుండా ఎన్నికల సామగ్రిని జాగ్రత్తగా పంపిణీ చేయాలని, నిర్ణీత సమయానికి సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.


