భావి శాస్త్రవేత్తలను తయారుచేసేది టీచర్లే | - | Sakshi
Sakshi News home page

భావి శాస్త్రవేత్తలను తయారుచేసేది టీచర్లే

Jan 10 2026 9:32 AM | Updated on Jan 10 2026 9:32 AM

భావి

భావి శాస్త్రవేత్తలను తయారుచేసేది టీచర్లే

ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

ముగిసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

కామారెడ్డి టౌన్‌: భావి శాస్త్రవేత్తలను తయారు చేసే ది ఉపాధ్యాయులేనని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. గురువులు ఎప్పుడూ పూ జనీయులేనన్నారు. జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌ శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఎమ్మె ల్యే మాట్లాడుతూ విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నా రు. ఉపాధ్యాయులు బడిలోనే ఉండాలని, కానీ కొందరు బయట తిరుగుతున్నారని, దానిని తగ్గించుకోవాలని సూచించారు. రాబోయే బడ్జెట్‌ సమా వేశాలలో విద్యావ్యవస్థపై చర్చిస్తానన్నారు. కాగా ఉదయం ప్రదర్శనను సందర్శించిన ఆయన.. వి ద్యార్థులు తయారు చేసిన ఒక్కో ప్రాజెక్టును పరిశీలి స్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సామాజిక సమస్యలకు పరిష్కారం చూపేలా నూతన ఆవిష్కరణలు ఉండాలన్నారు. విద్యార్థులు దేశభక్తి పెంపొందించుకోవడంతోపాటు నూతన ఆవిష్కరణల పై దృష్టి సారించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు.

వివిధ స్థాయిలకు ఎంపిక

రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిపి 1,700 మంది సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొన్నారని జిల్లా సైన్స్‌ అధికారి సిద్ధరాంరెడ్డి తెలిపారు. మొత్తం 7 విభాగాలలో 870 ప్రదర్శనలు ఇ చ్చారన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచినవారిని దక్షి ణ భారత, జాతీయ స్థాయి సైన్స్‌ఫెయిర్‌లకు ఎంపిక చేశామన్నారు. వారికి బహుమతులు అందించారు. రాష్ట్ర స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నికోలస్‌, డీఈవో రాజు, తదితరులు పాల్గొన్నారు.

భావి శాస్త్రవేత్తలను తయారుచేసేది టీచర్లే 1
1/1

భావి శాస్త్రవేత్తలను తయారుచేసేది టీచర్లే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement