ముగిసిన కబడ్డీ జట్టు శిక్షణ శిబిరం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన కబడ్డీ జట్టు శిక్షణ శిబిరం

Sep 24 2025 7:51 AM | Updated on Sep 24 2025 7:51 AM

ముగిసిన కబడ్డీ జట్టు శిక్షణ శిబిరం

ముగిసిన కబడ్డీ జట్టు శిక్షణ శిబిరం

ముగిసిన కబడ్డీ జట్టు శిక్షణ శిబిరం

నిజామాబాద్‌ నాగారం: నగరంలోని జిల్లా కబడ్డీ జట్ల శిక్షణ శిబిరం మంగళవారం ముగిసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు అంద్యాల లింగయ్య, ప్రధాన కార్యదర్శి గంగాధర్‌ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా జట్టుకు ఎంపికై న అండర్‌–16 బాలబాలికల జట్ల వివరాలను ప్రకటించారు. బాలుర కబడ్డీ టీం కోచ్‌ అన్వేష్‌, మేనేజర్‌ వినోద్‌, బాలికల కబడ్డీ టీమ్‌ కోచ్‌ సాయిలు, మేనేజర్‌ అనురాధ సమక్షంలో ఇట్టి క్రీడాకారులను ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ నెల 25 నుంచి 28 వరకు ముప్కాల్‌ భుదేవ్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో ఇట్టి క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. ముప్కాల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement