ఎస్సీ, ఎస్టీ కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా దయాకర్‌ గౌడ్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా దయాకర్‌ గౌడ్‌

Sep 20 2025 6:56 AM | Updated on Sep 20 2025 6:56 AM

ఎస్సీ, ఎస్టీ కోర్టు పబ్లిక్‌  ప్రాసిక్యూటర్‌గా దయాకర్‌

ఎస్సీ, ఎస్టీ కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా దయాకర్‌

మాల్తుమ్మెద విత్తన క్షేత్రంలో ధాన్యం వేలం

నిజామాబాద్‌ లీగల్‌: నిజామాబాద్‌ ఎస్సీ, ఎస్టీ కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా దయాకర్‌ గౌడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గతంలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించిన దయాకర్‌ గౌడ్‌, న్యాయవాదిగా పనిచేస్తునే కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. నిజామాబాద్‌ మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్‌ పీఏగా, కాంగ్రెస్‌ పార్టీ న్యాయవిభాగం లీగల్‌ సెల్‌ రాష్ట్ర కో–కన్వీనర్‌గా సైతం విధులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనను పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేంధర్‌ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి అభినందించారు.

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మె ద విత్తనోత్పత్తి క్షేత్రంలో విత్తన తయారీకి ఉపయోగపడని 429 క్వింటాళ్ల ధాన్యానికి శుక్రవారం సంబంధిత అధికారులు వేలం పాట నిర్వహించారు. విత్తన క్షేత్రంలో నిర్వహించిన వేలం పాటలో ఏడుగురు పాల్గొనగా వారిలో నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన స్కైలాబ్‌ గౌడ్‌ అనే వ్యక్తి క్వింటాల్‌కు రూ.1,590 చొప్పున పాడి ధాన్యాన్ని దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌ రెడ్డి, తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌ ఆర్‌ఎం రఘు, విత్తనక్షేత్ర ఏడీఏ ఇంద్రసేన్‌, ఏవో అచరిత, ఎల్లారెడ్డి ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాస్‌, ఏఈవో శ్యాంసుందర్‌ రెడ్డి, విత్తనోత్పత్తి క్షేత్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement