
గ్యాస్ ట్యాంకర్ను ఢీకొన్న బస్సు
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామశివారులో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, గ్యాస్ ట్యాంకర్ను ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వస్తోంది. జంగంపల్లి గ్రామశివారులోని జాతీయ రహదారిపై బస్సు ముందున్న గ్యాస్ ట్యాంకర్ను వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని, రోడ్డు అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు ముందర భాగం, ప్రవేశ ద్వారం తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణికులు అత్యవసర ద్వారం గుండా బ యటకు వచ్చారు. ఈ ప్రమాదంలో గ్యాస్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ కాకపోవడంతోపా టు పేలకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీ ల్చుకున్నారు. ఒకవేళ ట్యాంకర్ పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని పలువురు పేర్కొన్నారు.
దెబ్బతిన్న ఆర్టీసీ బస్సు ముందుభాగం
గ్యాస్ ట్యాంకర్

గ్యాస్ ట్యాంకర్ను ఢీకొన్న బస్సు

గ్యాస్ ట్యాంకర్ను ఢీకొన్న బస్సు