
రూ.7 లక్షలు నష్టపోయా..
12 ఎకరాలలో వరి పంట వేశాను. పచ్చగా పెరగడంతో దిగుబడి బాగానే వస్తుందని ఆశ పడ్డాను. కానీ గోదారమ్మ కోపానికి ఆశలు గల్లంతయ్యాయి. దాదాపు రూ. 7 లక్షల నష్టం వాటిల్లింది.
– ఏసప్ప ఈరన్న, రైతు, అల్జాపూర్
విలువైన వస్తువులు పాడయ్యాయి..
గతంలో ఎన్నడూ లేనివిధంగా మా ఊర్లోకి వరద నీరు వచ్చింది. ఇంట్లోని బీరువాలు, టీవీలు, ఫ్రిడ్జీలు పూర్తిగా పాడైపోయాయి. రూ.వేలల్లో నష్టపోయాం.
– గంగుబాయి, హంగర్గ, బోధన్ మండలం

రూ.7 లక్షలు నష్టపోయా..