
భారీ వర్షాలపై ఎంపీ అర్వింద్ ఆరా
● కలెక్టర్, సీపీలతో ఫోన్లో మాట్లాడి, పరిస్థితిని తెలుసుకున్న ఎంపీ
సుభాష్నగర్: జిల్లాలో రెండ్రోజులుగా ఎడతెరిపి లే కుండా కురుస్తున్న భారీ వర్షాల పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మ పురి ఆరా తీశారు. కలెక్టర్, సీపీలతో ఫోన్లో మాట్లాడి, పరిస్థితి ని తెలుసుకున్నారు. వినాయక చవితి పండుగ సెలవు దినమైనప్పటికీ, అధికారులు బాధ్యతతో పనిచేశారన్నా రు. రానున్న రెండు రోజులు జిల్లాకు రెడ్ అలర్ట్ ఉ న్నందున ఇదే స్ఫూర్తితో బాధ్యతలు నిర్వహించి ఎ లాంటి ప్రాణనష్టం జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరద బాధితులను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించి, కనీస సౌకర్యాలు అందించాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే అధికారులు ఆస్తి, పంట నష్టంపై నివేదికలు తయారు చేసి, ప్రభుత్వానికి అందజేయాలని కోరా రు. తాను కూడా సీఎంకు లేఖ రాస్తానని, హోం శాఖ కు సైతం నివేదిస్తానన్నారు. మరోవైపు ప్రజలకు కూడా ఎంపీ అర్వింద్ కీలక సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయకుండా అధికారులకు సహకరించాలన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తినందున పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు గోదావరి పరిసర ప్రాంతాలకి వెళ్లకుండా ఉండాలని కోరారు. వినాయక చవితి దృష్ట్యా, మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.