
అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్అర్బన్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎ స్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్యలతో కలిసి అట్రాసిటీ కేసులలో పురోగతి, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్, వివిధ శాఖల ద్వారా వెచ్చిస్తున్న నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం చైర్మన్ మాట్లా డుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలన్నారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలి పారు. దీర్ఘకాలికంగా పేరుకుపోయిన ఎస్సీ, ఎస్టీ భూముల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో ప్రతి నెల చివరి శనివారం పౌర హక్కుల దినాన్ని నిర్వహించాలని, కార్యక్రమంలో తహసీల్దార్, పోలీస్ అధికారి తప్పనిసరిగా హాజరయ్యేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. మూడు నెలలకోసారి డీవీఎంసీ సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు సరైన న్యాయం జరిగేలా అంకిత భావంతో పనిచేయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, స్వయం ఉపాధి కార్యక్రమాలలో కూడా వాటాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూరేలా చూ డాలన్నారు. పదోన్నతుల్లో సరైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు. ఎస్సీ, ఎస్టీలను వేధింపులకు గురిచేసే వారిపై కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. అంతకుముందు కలెక్టరేట్కు చేరుకున్న కమిషన్ చైర్మన్ వెంకటయ్యను కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య పూల మొక్కలు అందించి స్వాగతం పలికా రు. కమిషన్ చైర్మన్, జిల్లా అధికారులు బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమీక్షలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు నీలాదేవి, జిల్లా శంకర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారిణి రజిత, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
బక్కి వెంకటయ్య
సబ్ప్లాన్ నిధులు వాటా మేరకు
వెచ్చించాలి