‘లూపస్‌’పై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

‘లూపస్‌’పై అవగాహన అవసరం

May 11 2025 12:16 PM | Updated on May 11 2025 12:16 PM

‘లూపస్‌’పై అవగాహన అవసరం

‘లూపస్‌’పై అవగాహన అవసరం

నిజామాబాద్‌ నాగారం: శరీరంలోని అన్ని భాగాలను ప్రభావితం చేసే ‘లూపస్‌’ వ్యాధిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచించా రు. ప్రపంచ లూపస్‌ దినోత్సవం సందర్భంగా శని వారం ఐఎంఏ, నిజామాబాద్‌ రుమటాలజీ అండ్‌ ఆర్థరైటిస్‌ సెంటర్‌ సంయుక్త ఆధ్వర్యంలో 2కే రన్‌ నిర్వహించారు. వినాయక్‌నగర్‌లోని హనుమాన్‌ జంక్షన్‌ నుంచి రుమటాలజీ అండ్‌ ఆర్థరైటిస్‌ సెంట ర్‌ వరకు రన్‌ కొనసాగింది. అనంతరం చర్మవ్యాధి నిపుణురాలు గ్రీష్మ మాట్లాడుతూ లూపస్‌ వ్యాధి కళ్లు, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రక్త నాళాలు తదితర ఏ భాగాన్ని అయినా ప్రభా వితం చేస్తుందన్నారు. అన్ని అవయవాలపై దాడి చేస్తుందని తెలిపారు.

ఐఎంఏ అధ్యక్షుడు డా అజ్జ శ్రీనివాస్‌, కోశాధికారి డా. రాజేందర్‌ మాట్లాడుతూ లూపస్‌ వ్యాధి నివారణకు రుమటాలజిస్టును సంప్రదించి సూచించిన మందులు వాడాలన్నారు. డాక్టర్‌ జీ రవి కిరణ్‌ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, మంచి నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం తదితర మంచి జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు జీవన్‌ రావు , శ్రీశైలం, పీబీ కృష్ణమూర్తి, దామోదర్‌ రావు, ద్వారకానాథ్‌, గాంధీ తదితరులు పాల్గొన్నారు.

నగరంలో 2కే రన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement