బాసర నుంచి భైంసా మీదుగా మహోర్ వరకు 161 హైవేను విస్తరించాలని కేంద్ర మంత్రి నితిన్గడ్కరిని కలిశాను. గతేడాది జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలోనూ ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి వినతిపత్రం అందించాను. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇక్కడి పరిస్థితులను ఆయనకు వివరించాం. సరస్వతీ అమ్మవారు కొలువైన బాసర, రేణుక ఎల్లమ్మ, దత్తాత్రేయ స్వామి ఉన్న మహోర్ క్షేత్రాల మధ్య ఆధ్యాత్మిక రహదారి నిర్మాణం జరుపాలని కోరాం. ఎలాగైనా ఒప్పించి ఈ ఆధ్యాత్మిక రహదారి నిర్మాణం చేయిస్తాం.
– రామారావు పటేల్, ముధోల్ ఎమ్మెల్యే


