
జిల్లా కేంద్రంలోని ఈద్గాను పరిశీలిస్తున్న ఎస్పీ
● ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల
నిర్మల్టౌన్: రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల అన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఈద్గాం వద్ద గల ప్రార్థన స్థలాన్ని పరిశీలించారు. అధికారులను అడి గి వివరాలు తెలుసుకున్నారు. ప్రార్థనలకు ఎ లాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించా రు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల ని కోరారు. ఎస్పీ వెంట నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, పట్టణ సీఐ అనిల్ కుమార్, తదితరులు ఉన్నారు.
ఈద్గా వద్ద ఏర్పాట్లు పరిశీలన
భైంసాటౌన్: పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు స మీపంలోగల ఈద్గా వద్ద ఎస్పీ జానకీ షర్మిల ఏర్పా ట్లు పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని, బందోబస్తు ఏ ర్పాట్ల సూచనలు చేశారు. ఆమె వెంట ఏఎస్పీ కాంతిలాల్పాటిల్, ఎంఐఎం నాయకులు ఫైజుల్లాఖా న్, మాజీద్, ఇంతియాజ్, తదితరులు ఉన్నారు.