
చురాచంద్పూర్/బిష్ణుపూర్: మణిపూర్లో మళ్లీ అశాంతి చెలరేగింది. గురువారం చురాచంద్పూర్ జిల్లాలోని చింగ్ఫీ గ్రామంలో భద్రతా దళాలు, అనుమానిత కుకీ ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కుకీ వర్గానికి చెందిన ఒక మహిళ మరణించింది. ఆ తర్వాత బిష్ణుపూర్ జిల్లాలోని ఫుబాలా గ్రామంలో కాల్పుల్లో ఒక మైతేయి రైతు గాయపడ్డాడు. ఈ సంఘటనలతో ఈ ప్రాంతంలో మళ్లీ జాతుల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.
ఇరువర్గాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. పోలీసులు, అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు బిష్ణుపూర్–చురాచంద్పూర్ సరిహద్దులో ఉన్న లోతట్టు గ్రామమైన ఫుబాలా వద్ద సాయుధులు కాల్పులు జరిపారు. పక్కనే ఉన్న కొండలలో నుంచి పొలాల్లో పనిచేస్తున్న రైతులపై అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. మైతేయి రైతు 60 ఏళ్ల నింగ్తౌజామ్ బిరెన్ ఎడమ చేతికి గాయమైంది.
వెంటనే బిష్ణుపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. దాడి తరువాత, భద్రతా దళాలు సమీపంలోని చింగ్ఫీ గ్రామంలో ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో అను మానిత ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిగా యి. ఈ కాల్పుల్లో చురాచంద్పూర్లోని లాంగ్చింగ్మాన్బి గ్రామ అధిపతి ఖైఖోగిన్ హవోకిప్ భార్య హోయిఖోల్హింగ్ హవోకిప్ బుల్లెట్ తగిలి మరణించింది.