అద్వానీకి భారతరత్న అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | President Droupadi Murmu Present Bharat Ratna To LK Advani, Watch Video Inside - Sakshi
Sakshi News home page

అద్వానీకి భారతరత్న అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Published Sun, Mar 31 2024 12:21 PM

President Droupadi Murmu Present Bharat Ratna To LK Advani - Sakshi

సాక్షి, ఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ భారతరత్న అందుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆదివారం అ‍ద్వానీకి భారతరత్నను ప్రదానం చేశారు. 

కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ కలిసి ఆదివారం అద్వానీ ఇంటికి వెళ్లారు. అనంతరం, అద్వానీకి భారతరత్నను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌, వెంకయ్యనాయుడు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఇక, నిన్న (శనివారం) పీవీ నరసింహరావు, చౌదరి చరణ్‌ సింగ్‌, ఎంఎస్‌ స్వామినాథన్‌, కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్నలను అందజేసిన విషయం తెలిసిందే. 

Advertisement

తప్పక చదవండి

Advertisement