ఇన్‌ఫార్మర్‌ నెపంతో  గిరిజనుడి హత్య  | Maoists kill Chhattisgarh villager | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార్మర్‌ నెపంతో  గిరిజనుడి హత్య 

Jan 28 2025 6:27 AM | Updated on Jan 28 2025 6:27 AM

Maoists kill Chhattisgarh villager

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం 

చర్ల: పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడనే నెపంతో మావోయిస్టులు ఓ గిరిజనుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బీజాపూర్‌ జిల్లా బైరంఘడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కేశముండిపారా గ్రామానికి చెందిన సోడి భద్రు(45) ఇంటికి ఆదివారం రాత్రి 7 గంటలకు వచ్చిన మావోయిస్టులు భద్రును బయటకు లాక్కొచ్చారు. 

అడ్డొచ్చిన భార్య, కుటుంబసభ్యులను పక్కకు నెట్టి ఇంటి ఆవరణలోనే గొడ్డలితో తల, నుదిటిపై నరికారు. దీంతో భద్రు అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం ఉదయం సమాచారం అందుకున్న బైరంఘడ్‌ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బైరంఘడ్‌ తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. కాగా, పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా మారి తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నందునే హతమార్చామని, ఇలా ఎవరు వ్యవహరించినా ఇదే శిక్ష పడుతుందని హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ వదిలారు. 

Advertisement
 
Advertisement
Advertisement